
* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్
ఆకేరున్యూస్, వరంగల్: ఎవరైన క్రికెట్, ఇతరత్ర బెట్టింగ్లకు పాల్పడినా.. ప్రోత్సహించినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువత బెట్టింగ్లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన చేశారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ యాప్ల మోజులో పడిలో వారి బంగారు భవిష్యత్ను అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది సాధించడంతో ప్రతిఒక్కరికి ఇంటర్ నెట్ అందుబాటులోకి రావడంతో పాటు, సోషల్ మీడియా సైతం యువతకు మరింత చేరువఅయింది. తద్వారా మోసగాళ్ళ మోసపూరితమైన ప్రకటనలు, సందేశాలకు యువత ఆకర్షితుల్కె సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ పాటు, ఇతరత్రా బెట్టింగ్ల వైపు యువత తొంగిచూడడమే కాకుండా ఇంటి సభ్యులకు తెలియకుండా వీటిల్లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతుఆన్నరన్నారు. అలాగే కొన్ని సందర్బాల్లో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై వుందని. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో ఐపిల్ సిజన్ ప్రారంభం అయింది. ఇది దృష్టిలో వుంచుకుని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలని, ముఖ్యంగా వారు క్రికెట్ మ్యాచ్లు ప్రసారం అయ్యే సమయాల్లో వారి ప్రవర్తతో పాటు, వారు సెల్ఫోన్లలో మాట్లాడే సంభాషణపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్లను కట్టడి చేసేందుకు గాను పెద్దఎత్తున చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందుకోసం ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, టాస్క్ఫోర్స్తో పాటు ఇతర ప్రత్యేక బృందాలను వినియోగించుకొవడం జరుగుతోందని. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సిజన్ ప్రారంభమయ్యే నాటి నుండి ఇప్పటి వరకు మొత్తం నాలుగు నాలుగు కేసుల్లో తొమ్మిడి మందిని అరెస్టు చేయడంతో వీరి బ్యాంక్ ఖాతాల్లో సూమారు 42లక్షల 68వేల మూడు వందల రూపాయల వరకు లావా దేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహరంలో వరంగల్ పోలీస్ కమిషనరెట్ పోలీసులు తొలిసారిగా క్రికెట్ బెట్టింగ్ బుకీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన వీరమణికుమార్ను అరెస్టు చేయడం జరిగింది. ఈ నిందితుడి బ్యాంక్ ఖాతాల్లో సుమారు మూడున్నర కోట్ల రూపాయల సంబంధించిన లావా దేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగిందని. ఇకపై ఎవరైన బెట్టింగ్లను పాల్పడిన, పోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎవరైన బెట్టింగ్లకు పాల్పడినట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసు కమిషనర్ వెల్లడిరచారు.
…………………………………………..