
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలో ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిరది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.
…………………………………….