
* ఆగం కానున్న ఆదివాసీల బతుకులు
* కార్పొరేట్ల చేతికి సహజ సంపద
* సంపదను కొల్లగొట్టడానికే జీవో 49
* జీవో నెం 49 ని రద్దుచేయాలి
* భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మావోయిస్ట్ ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పత్రికా
ప్రకటన
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జల్ జమీన్ జంగల్ కోసం పోరాడిన కొమురం భీం పేరుతో ఏర్పాటైన కొమురం భీం జిల్లాలోని 339 గ్రామాలను ఖాళీ చేయించడానికే కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49ని తెచ్చిందని ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ ( మావోయిస్ట్ ) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో పత్రికా ప్రకటన విడుదల అయింది.
ఈ జోవో జంతు పులల కోసం కాదని మోదీ, అమిత్ షా మానసపుత్రులైన అంబానీ అదానీల కోసమేనని లేఖలో పేర్కొనబడింది.వేల సంవత్సరాలుగా అడవి జంతువులను కాపాడుతూ వాటితో సహజీవనం చేస్తున్న అడవికి దూరం చేసి సహజ సంపదను కొల్లగొట్టడానికే కేంద్రం ఈ జీవోను తెచ్చిందని లేఖలో పేర్కొన్నారు.
మూడు జిల్లాలు మాయం
ఈ జీవో అమలైతే తెలంగాణలో ఉన్న మూడు జిల్లాలు కొమురం భీం జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కనుమరుగవుతాయని లేఖలో పేర్కొనబడింది.సంపదను దోచుకోవడానికే కుట్ర దేశంలోని మైదాన ప్రాంతాలను,గుట్టలను చెరువులను,నదులను సర్వనాశం చేసిన దోపిడీ దారులు రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్ లో పొందుపరిచిన జంతు పరిరక్షణ,పర్యావరణం పేరుతో దేశ మూలవాసులైన ఆదివాసీలను అడవులకు దూరం చేసే కుట్ర జరుగుందన్నారు.టైగర్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్,సిర్పర్ (యు) వాంకిడి,బిజ్జూర్,జైనూర్, కెరిమెరి, ఆసిఫాబాద్, రెబ్బన,కాగజ్నగర్ నార్నర్,సిర్పూర్ టి , చింతల మానపల్లి,గాజుగూడ,లింగాపూర్, పెంచికల పేట మండలాలను ఖాళీచేయించే ప్రయత్నాలను మానుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు,,
రోడ్డు పాలైన ఆదివాసీ బతుకులు
ఇప్పటికే కిల్వార్ టైగర్ జూన్ పేరుతో ఆదివాసిలను రోడ్డు పాలు చేశారని లేఖలో పేర్కొన్నారు.
అధికారిక లెక్కల ప్రకారం 12 లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసిలకు
భూమి హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.ఇప్పటికైనా ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్నఆదివాసీలకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి భూ మాతలో
నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వీరికి రైతు భరోసా కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారులు,పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న అరెస్టులతో కేసులతో బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
సీతక్క స్పందించాలి
ఆదివాసీ బిడ్డ మాజీ నక్సలైట్ గా ప్రాచుర్యంలో ఉన్న మంత్రి సీతక్క దీని స్పందించాలని లేఖలో
డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మంత్రవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న సీతక్కపై అధివాసీలకు
అంచనాలు ఉన్నయని లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గురించి
1996లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పెసా చట్టం గురించి 2006 కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఎఫ్ ఆర్ ఎ వన్ బై సెవంటీ చట్టం గురించి సీతక్క మచ్చిపోయారా అంటూ ప్రశ్నంచారు.
ప్రజలారా మేల్కొనండి
ప్రజలారా.. ప్రజాస్వామిక వాదులారా..కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశ మూల వాసులైన ఆదివాసీలను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత. వారు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం గ్రామసభల నిర్ణయాధికారంతో అభివృద్ధిని కోరుకుంటున్నారు. వారు కోరుకునే విధంగా అమలు కోసం ప్రజలందరూ అండగా ఉండాలని లేఖలో సేర్కొన్నారు.
…………………………………………..