
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఆత్మహథ్యకు పాల్పడ్డాడు. శ్రీకాళహస్తి- తిరుపతి మార్గంలో వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ ఘటన జరిగింది. రేణిగుంట వద్ద బస్సులో వెనుక సీటు వద్ద ఉన్న హ్యాంగర్కు (యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కండక్టర్ గుర్తించారు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివరాలు సేకరిస్తున్నారు.
………………………………………………………