
* సత్య నాదెళ్లను కలిసిన సీఎం రేవంత్
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ సీిఇవో సత్యనాదెళ్లను సిఎం రేవంత్ రెడ్డి కోరారు. మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. సత్య నాదెళ్లను ఆయన నివాసంలో మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎస్ శాంతికుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీలో మైక్రోసాప్ట్ భాగస్వామ్యం, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ ప్రతిపాదనలు.. ఏఐ సిటీలో ఆర్అండ్డీ ఏర్పాటుకు సహకారంపై చర్చించారు. క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కీలకపాత్ర పోషించాలని సీఎం కోరారు. ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్ ఇవ్వాలని మైక్రోసాప్ట్ సీఈవోకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాలుగు డేటా సెంటర్లు, హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించారు. ఐటి సెక్రటరీ జయేష్ రంజన్ కూడా వీరివెంట సీఈవో సత్యనాదెళ్లను కలిశారు. సత్య నాదెళ్ల వ్యక్తిగత పర్యటన కోసం ఇండియాకు వచ్చారు. ఆయన స్వస్థలం హైదరాబాద్. బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో ఉన్న సత్య నాదెళ్ల ఉన్నారు. ఆయనను అధికారికంగా కాకుండా మర్యాదపూర్వకంగా ప్రభుత్వ పెద్దలు కలిసినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్లో సాప్ట్వేర్ రంగ అభివృద్ధి కోసం సత్యనాదెళ్ల సూచనలు, సలహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినట్లుగా తెలుస్తోంది. సత్య నాదెళ్ల హైదరాబాద్లో చదువుకుని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఆయన తండ్రి యుగంధర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన కొంత కాలం క్రితం చనిపోయారు. లో ప్గ్రోªల్ ఇష్టపడే సత్య నాదెళ్ల ఎక్కువ హంగామా చేయరు. హైదరాబాద్ వచ్చిన విషయం తెలియడంతో ప్రభుత్వ పెద్దలు ఆయనను కలవాలని ఆసక్తి చూపించడంతో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. మైక్రోసాప్ట్ సీఈవోగా అధికారికంగా పర్యటనలకు గతంలో వచ్చారు. అప్పుడు నేరుగా మైక్రోసాప్ట్ ఆర్ అండ్ డీకి వెళ్లి ఉద్యోగులతో సమావావేశాలు నిర్వహించేవారు. హైదరాబాద్ మైక్రోసాప్ట్ .. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ను నిర్మిస్తోంది, డేటా, క్లౌడ్ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. సత్య నాదెళ్లతో జరిగి సమావేశానికి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. అలాగే బీఆర్ఎస్ హయాం నుంచి తెలంగాణలో పెట్టుబడులు, ఇతర అంశాల్లో కీలకంగా వ్యవహరించి సీనియర్ అధికారి జయేష్ రంజన్ కూడా వెళ్లారు. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి వెళ్లారు. సాప్ట్వేర్ రంగంలో తెలంగాణలో తాము చేపట్టబోయే ప్రాజెక్టులు, ఏఐ సిటీ నిర్మాణం, ఫోర్త్సిటీ వంటి వాటిపై ముఖ్యమంత్రి సత్యనాదెళ్లకు వివరించినట్లుగా తెలుస్తోంది. వాటిని సక్సెస్ ఫుల్ చేయడంలో నాదెళ్ల సలహాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
…………………………………………………………