
* 2వేలు పెంచుతూ… ఎకరాకు 12 వేలు ఇవ్వాలని నిర్ణయం
* భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా సాయం
* ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఆర్థికసాయం
* వ్యవసాయేతర భూములకు భరోసా లేదని స్పష్టీకరణ
* జనవరి 26 నుంచి పథకాల అమలుకు నిర్ణయం
* వివరాలు వెల్లడిరచిన సీఎం రేవంత్రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’ అమలు కానుంది. రైతు భరోసా కింది వ్యవసాయ భూములు ఎకరాకు ఏటా 12వేలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వ్యవసాయేతర భూములను మినహాయించారు. రాళ్లూ, రప్పలు, కొండలు, రోడ్లో పోయిన భూములు, క్రషర్లు నిర్వహిస్తున్న భూములు, ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి. కేబినేట్ సమావేశంలో తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటించారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26నుంచి దీనిని అమలు చేస్తామని, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తాం. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేశామన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఇందులో అనుమానాలకు తావులేదన్నారు. ఇదే సందర్భంలో సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వమని కూడా స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ నుండి ఈ పథకం అమలు చేస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శనివారం తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రి మండలి సుధీర్ఘంగా చర్చించింది.
దీనితో పాటు పలు కీలక నిర్ణయాలకు మంతి మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడిరచారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భూమి లేకున్న రైతు భరోసా ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేశారు. భూమిలేని కుటుంబాలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట భూమిలేని కుటుంబాలకు సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు రైతు భరోసా పెంచి ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రేషన్కార్డులు, సమగ్ర కులగణనపై భేటీలో చర్చించారు. భూమిలేని పేదలకు భృతి, సన్నబియ్యం పంపిణీపై చర్చించారు. టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణపై చర్చించారు. ఫిబ్రవరి నుంచి సన్నబియ్యానికి కేబినెట్ ఆమోదించింది. టూరిజం పాలసీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్సిగ్నల్ తెలిపింది. ఆంక్షలు లేని రైతు భరోసాకు ఆమోదం తెలిపింది. సంక్రాంతి కానుకగా రైతు భరోసా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పంచాయతీరాజ్లో 508 కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. అలాగే కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదించింది.
…………………………………………..