![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/images-9.jpg)
* 19వ తేదీ వరకు పర్యటన
ఆకేరున్యూస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆరు రోజులపాటు విదేశాల్లోనే ఉండనున్నారు. గురువారం రాత్రి ఢల్లీి నుంచి బయల్దేరనున్న సీఎం రేవంత్ బృందం.. ముందుగా సింగపూర్కు చేరుకుంటుంది. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. అనంతరం దావోస్కు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. ఈ పర్యటనలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి వెంట ఉంటారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢల్లీి నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి ముందుగా సింగపూర్కు చేరుకుంటారు. 17, 18, 19 తేదీల్లో అక్కడ పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని సందర్శిస్తారు. నైపుణ్య అభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్ ఐటీఈతో ఒప్పందం చేసుకుంటారు. సింగపూర్లో రివర్ ఫ్రంట్ను సందర్శిస్తారు. ప్రపంచ స్థాయిలో మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున అక్కడి రివర్ ఫ్రంట్ ఏరియా అభివృద్ధి చేసిన తీరుతెన్నులను పరిశీలిస్తారు. సింగపూర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బృందం 20వ తేదీ ఉదయం దావోస్ కు చేరుకుంటుంది. 20 నుంచి 22వ తేదీ వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2025లో పాల్గొంటారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ సారి అంతకు మించిన పెట్టుబడుల లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులతో సమీక్షలో వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. ఐటీ, ఏఐ, ఫార్మా, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలతో పాటు ఇటీవల ప్రకటించిన పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విధానం (క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ) పై ప్రముఖ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, వరల్డ్ క్లాస్ సిటీగా గ్రేటర్ సిటిలో ఎలివేటేడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏడాదిలో చేపట్టిన విదేశీ పర్యటనలన్నీ విజయవంతమయ్యాయి. గత ఏడాది దావోస్ పర్యటనతో పాటు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. దేశంలో అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తెలంగాణకు భారీగా పెట్టుబడులు సమీకరించే లక్ష్యంతో సీఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ విదేశీ పర్యటనకు బయల్దేరుతుంది.
………………………………………………………………