
ఆకేరున్యూస్, నాగర్కర్నూల్ : కాయకష్టం చేసి కల్లు తాగేందుకు కల్లు దుకాణానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది. తాను తీసుకున్న కల్లు సీసాను తాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ సీసాలో కట్ల పాము ప్రత్యక్షమైంది. దీంతో ఆందోళనకు గురైన ఆ వ్యక్తి తాగిన రెండు బుక్కల కల్లును నోట్లో నుంచి బయటకు ఉమ్మేశాడు. అతనికి ప్రాణాపాయం కూడా తప్పింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు కల్లు దుకాణంపై దాడి చేశారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లిలో వెలుగుచూసింది. కాగా,, స్థానికులు ఆగ్రహానికి గురైన తర్వాత కూడా ఆ కల్లు దుకాణం యజమాని నిర్లక్ష్యంతో జనాలకు కల్లు విక్రయించాడు. తమ ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
…………………………………