
ఆకేరున్యూస్, హైదరాబాద్: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు గుండెపోటు రాగానే.. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సిబ్బంది.. ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్పందించిన వైద్యులు పద్మారావు గౌడ్కు స్టంట్ వేసి ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు.
…………………………