
* ఆయన వెంట డిప్యూటీ సీఎం.. టీపీసీసీ చీఫ్ కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దావోస్ పర్యటన ముగించుకుని ఇటీవలే రాష్ట్రానికి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) తాజాగా మధ్యప్రదేశ్(Madyapradhesh) వెళ్లారు. ఇందౌర్లో కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో సభ కు హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkatreddy), సీతక్క, ఎంపీ అనిల్ కుమార్యాదవ్, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ తదితరులు వెళ్లారు. వీరు కూడా సంవిధాన్ బచావో సభలో పాల్గొననున్నారు.
…………………………………………………..