
* గురజాడను గుర్తుచేసుకుంటూ ప్రసంగం మొదలుపెట్టిన సీతారామన్
* కాసేపట్లోనే కీలక అంశాలు వెల్లడి
ఆకేరు న్యూస్, డెస్క్ : “దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ష అంటూ గురజాడ అప్పారావు సూక్తిని గుర్తుచేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలాసీతారామన్.. ఈ బడ్జెట్ దేశ ప్రజలకు మంచి చేస్తుందని చెప్పారు. ఇది పేదలు, రైతులు, మహిళలు, యువత మెచ్చే బడ్జెట్ అవుతుందన్నారు. ప్రధానంగా వ్యయసాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. కేన్సర్ మందులు, సర్జికల్ పరికరాల ధరలు తగ్గించామన్నారు. అంతేకాదు.. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలోనూ కేన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ బల్క్ డ్రగ్ తయారీకి పన్ను మినహాయింపు ఇచ్చామన్నారు. యువతకు తోడ్పాటు అందించేలా దేశీయ ఎలక్ట్రానిక్ రంగానికి ఊతమిచ్చామన్నారు. ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కింద దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 1.73 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీలలో వచ్చే అయిదేళ్లలో 75 వేల సీట్లు పెరగనున్నాయని తెలిపారు.
…………………………….