
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్ను మినహాయింపుతో మధ్యతరగతి ప్రజలకు ఊరట, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, ఎంఎస్ ఎంఈ, స్టార్టప్ లకు మద్దతు, బీమారంగంలో ఎఫ్డీఐ సంస్కకరణలు, మూలధనం వ్యయం పెంపు తదితర ప్రయోజకర అంశాలు ఉన్నాయి. అయితే, వాటిని కూలంకశంగా పరిశీలిస్తే దీర్ఘకాలిక పెట్టుబడి, ఆర్థిక స్థిరత్వంలో సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అవేంటో పరిశీలిద్దాం..
1. మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట
కేంద్ర బడ్జెట్ – 2025 ఈసారి మధ్య తరగతి ప్రజానీకానికి శుభవార్త చెప్పింది. 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపునిచ్చింది. స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలిపితే, ఏడాదికి .12.75 లక్షల జీతం పొందే వ్యక్తులకు ఏ విధమైన పన్నూ ఉండదని పేర్కొంది. ఇది మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చే అంశం. దీని వల్ల ఆర్థిక వినియోగం పెరిగి హౌసింగ్, ఆటోమొబైల్, రిటైల్ రంగాల్లో వృద్ధి జరగనుంది.
సమస్యలు
పాత పన్ను విధానంలో ఉండేవారికి కొత్త ప్రయోజనాలు వర్తించవు. 80సి, హెచ్ ఆర్ ఏ, హౌస్ లోన్ వడ్డీ, బీమా మినహాయింపులు పొందేవారికి పై ప్రయోజనాలు వర్తించవు. కొందరు పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు ఇన్సూరెన్స్, డిపాజిట్ల వైపు మొగ్గుచూపేవారు. కొత్త విధానంతో 12 లక్షల వరకు పన్ను భారం ఉండదు కాబట్టి, పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎల్ ఐసీ, టాక్స్ సేవింగ్ ఎఫ్ డీల్లో పెట్టుబడులు తగ్గుతాయి.
2. ఎంఎస్ ఎంఈ, స్టార్టప్లకు ప్రోత్సాహం
* ఎంఎస్ ఎంఈ, స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇస్తూ క్రెడిట్ గ్యారెంటీ పరిమితిని రూ.10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచడం ద్వారా స్టార్టప్ లు తక్కువ ఖర్చుతోనే రుణాలు పొందే అవకాశం ఏర్పడిరది. ఎంఎస్ ఎంఈ పెట్టుబడులు, టర్నోవర్ పరిమితులను 2.5, 2 రెట్లు పెంచడం ద్వారా వ్యాపారాల అభివృద్ధికి సహకారం లభిస్తుంది. స్టార్టప్ల కోసం రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక నిధి, మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహంతో ఉద్యోగావకాశాలు పెరుగుతుతాయి. పరిశ్రమలు వృద్ధి చెందుతాయి.
సమస్యలు
* ఈ నిధులను వ్యాపారులు సరిగ్గా వినియోగిస్తారా, లేదా చూడాలి. బ్యూరోక్రసీ సమస్యలు తలెత్తవచ్చు.
* బడ్జెట్లో ఏఐ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ – మౌలిక సదుపాయాల అభివృద్ధి
* ఏఐ, దీప్-టెక్ పరిశోధనకు పెట్టుబడులు
* ఏఐ విద్య కోసం రూ.500 కోట్లు నిధులు, భారతదేశం ఏఐ టాలెంట్ హబ్గా మారేందుకు సహకారం
* దీప్-టెక్ పరిశోధనకు రూ. 20,000 కోట్లు, ఏఐ, సె మీకండక్టర్, భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఉపయుక్తం
* రవాణా, కనెక్టివిటీ అభివృద్ధి
* ఇండియా పోస్ట్ ను పెద్ద లాజిస్టిక్స్ కంపెనీగా మార్చడం.. 1.5 లక్షల గ్రామీణ పోస్టాఫీసులు కనెక్ట్ చేయడం..
* ఉడాన్ పథకం 120 కొత్త గమ్యస్థానాలకు విస్తరణ… విమాన, పర్యాటకరంగానికి ప్రోత్సాహం
4. ఆర్థిక స్థిరత్వం , వ్యయ నియంత్రణ
* ఆర్థిక లోటు నిర్వహణ
* జీడీపీలో 4.8శాతం వరకు ఆర్థిక లోటు ఉంచడం.. అంటే ప్రభుత్వ ఖర్చులను నియంత్రించే ప్రణాళిక ఉంది
* రూ.10.1 లక్షల కోట్లు మూలధన వ్యయం.. ఇన్ఫ్రాస్టక్చర్ ఆధారిత ఆర్థిక వృద్ధికి బలమైన మద్దతు
సమస్యలు
* లక్ష కోట్ల మేర ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయ నష్టం… ఇది తీవ్రంగా ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు.
* పన్ను తగ్గింపును ప్రైవేటీకరణ, జీఎస్టీ కలెక్షన్ల ద్వారా సమతుల్యం చేయాల్సిన అవసరం.
5. బీమా రంగ సంస్కరణలు-పన్ను కంప్లైయన్స్
* బీమా రంగంలో ఎఫ్డీఐ 74 శాతం నుంచి 100 శాతం పెంపు
* భారత బీమా మార్కెట్ లో అధిక విదేశీ పెట్టుబడులు… నూతన ఉత్పత్తులు, పోటీ, వినియోగదారులకు మెరుగైన ప్రణాళికలు
టీడీఎస్, ఇతర పన్ను సడలింపులు
* టీడీఎస్ మినహాయింపు పరిమితి రెంటుకు రూ.2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంపు.. చిన్న లీజుదారులకు సహాయం
* వృద్ధుల వడ్డీ ఆదాయపు టీడీఎస్ పరిమితి రూ.50,000 నుంచి లక్ష వరకు పెంపు… ఆర్థిక భారం తగ్గుతుంది.
సమస్యలు
* కార్పొరేట్ పన్ను తగ్గింపులు లేవు. ఇది భారత వ్యాపారాలను అంతర్జాతీయంగా పోటీదారుల కంటే వెనుకబెడుతుంది.
* ఎంఏటీ, ఏఎంటీ కొనసాగుతున్నాయి, వ్యాపారాలకు పన్ను మార్గదశలు పరిమితంగా ఉంటాయి.
6. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి
రైతులకు కొత్త పథకాలు
* పీఎం ధన్ ధ్యాన్ కృషి యోజన ద్వారా 1.7కోట్ల మంది రైతులకు మద్దతు, సాంకేతిక, రుణ సదుపాయాలు
* ఆరు సంవత్సరాల ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం…. తుర్, ఉరద్, మసూర్ వంటి పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపు
* ఎంఎస్ ఎంఈ, సహకార రంగాలకు పెరిగిన రుణ సదుపాయాలు.
సమస్యలు
* రుణమాఫీ లేదా ఎంఎస్పి పెంపుపై ఎటువంటి ప్రకటనా లేదు. ఇది రైతుల సంఘాలను నిరాశ పరచవచ్చు.
7. తుది విశ్లేషణ
* ఒక సంతులిత, వృద్ధి-ఆధారిత బడ్జెట్
పాజిటివ్ అంశాలు..
* మధ్య తరగతి వేతనజీవులకు భారీ పన్ను ఉపశమనం
* అధిక మూలధన వ్యయం, దీర్ఘకాలిక వృద్ధికి ప్రోత్సాహం
* ఏఐ, ఎంఎస్ ఎంఈ, స్టార్టప్ లకు మద్దతు
* ఎఫ్డీఐ సంస్కరణల ద్వారా విదేశీ పెట్టుబడులకు…
………………………………………………….