ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపుల్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం, కళాశాలలో MPC ప్రథమ సంవత్సర చదువుతున్న పంగిడిపల్లి గ్రామానికి చెందిన కౌడగాని సుష్మ D/O మల్లికార్జున్ ఫెన్సింగ్ గేమ్ లో జాతీయ స్థాయికి ఎంపికైంది. 68వ SGFI ఫెన్సింగ్ గేమ్ లో జాతీయ క్రీడలకి అండర్- 19 విభాగంలో ఎంపిక అయ్యిందని, బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో ఫిబ్రవరి 8న జరగబోతున్న క్రీడల్లో పాల్గొనబోతున్నట్లు కేజీబివి ఏస్ ఓ సిహెచ్ అర్చన తెలిపారు. ఆమెకి పోటిల్లో పాల్గొనటానికి, ఇతరత్రా క్రీడ సామాగ్రికి పాఠశాల ప్రత్యేక అధికారిని సి హెచ్.అర్చన, ఉపాధ్యాయులు, సిబ్బంది,ఈటల సమ్మయ్య , అంకతి సాంబయ్య, దహగం రమేష్ ,NRI బోడ మల్లారెడ్డి చేసిన ఆర్థిక సహాయం పట్ల స్పెషల్ ఆఫీసర్ అర్చన, వ్యాయామ ఉపాధ్యాయురాలు స్వప్న సంతోషం వ్యక్తపరిచారు.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
