
* చాకచక్యంగా పట్టుకున్న హన్మకొండ పోలీసులు
ఆకేరున్యూస్, హన్మకొండ : గంజాయి, హశీష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం హన్మకొండ ఎస్ఐ. పరుశురాములు, రెడ్డి కాలనీ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు మరియు ఒక్క ఆటో, బండితో ఉండి పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా.. వారిని పట్టుకున్న పోలీసులు విచారించారు. వారు పేరు: 1) కోటగిరి సాయి వినయ్ఏవినయ్ తండ్రి: శ్రీనివాస్ R/o సుధానగర్, హన్మకొండ, ప్రస్తుతం రెడ్డి కాలనీ హన్మకొండ అని ఇతను 2023 సంవత్సరంలో తన స్నేహితుడు వరుణ్తో ఆంద్ర మారేడుమిల్లి టూర్కి వెళ్లి గంజాయి తీసుకొని తిరిగి వస్తుండగా డొంకరాయి పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపగా జైల్లో లావుడియా రవీందర్ R/o ములుగు పరిచయం అయి తాను గంజాయి అమ్ముతుంటానని తన ఫోన్ నెంబర్ ఇచ్చినాడని, అలాగే గణేష్ నిమజ్జనం జరుగుతున్నపుడు గొడవ కాగా హన్మకొండ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదు కాగా ఖమ్మం సెంట్రల్ జైలుకు పంపగా అప్పుడు జైలులో హరి, కబీర్ సింగ్ అనే పరిచయం అయి వీరు సాయి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అందజ 3 వారాలక్రితం హరి, సాయికి ఫోన్ చేసి, తన దగ్గర గంజాయి నుండి తీసిన ఆశిష్ ఆయిల్ ఉంది దీనిని సిగారెట్స్కు పూసి తాగాలి కిక్కు బాగా ఉంటుందని చెప్పినాడు. ఇది కిలో 12,50,000/- రూపాయలు ఉంటుందని చెప్పి, హరి అన్న రామూర్తి హశీష్ ఆయిల్ను వరంగల్ రైల్వే స్టేషన్ లో ఇచ్చి వెళ్ళగా సాయి ఇంట్లో పెట్టినాడు, 10 రోజుల క్రితం 2) లావుడియా రవీందర్, మరియు 3) గుగులోత్ హరిసింగ్ రవీందర్ ఆటోలో ఒక్క లాగేజ్ బ్యాగును 12 కిలోల ఎండు గంజాయి తీసుకొని సాయికి ఇవ్వగా ఇంట్లో దాచి పెట్టినాడు. ఇందులో నుండి 2.కిలోల గంజాయి ని కుశాల్, హరీష్, జై సింహలకు అమ్మి, మిగతాది సాయి ఇంట్లో దాచి పెట్టినాడు. తర్వాత సాయి రవీందర్ కి ఫోన్ చేసి తన దగ్గర ఉన్న ఆశిష్ ఆయిల్ ఉందని చెప్పి ఎవరికీ ఐన అమ్ముదామని చెప్పగా ఈరోజు రవీందర్, గుగులోత్ హరిసింగ్ రవీందర్ ఆటో లో సాయి ఇంటికి రాగా సాయి బైక్ పైన తన దగ్గర ఉన్న గంజాయి లాగేజ్ బ్యాగ్ పెట్టుకొని, ఆశిష్ ఆయిల్ ని స్టీల్ డబ్బా రవీందర్, హరి కి ఇవ్వగా వాళ్ళు రవీందర్ ఆటో లో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుండగా పోలీసు వారు పట్టుకున్నారు అని చెప్పగా వీరిని పోలీస్ స్టేషన్ కు తీసుక వచ్చి పిర్యాదు ఇవ్వగా ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి, అట్టి వ్యక్తుల వద్ద ఉన్న గంజాయిని తీసుకొని ఆ ముగ్గురు వ్యక్తులను ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ పై కోర్టులో హాజరు పరుస్తున్నారని చెప్పారు.
నేరస్థుల పేర్లు:-
1) కోటగిరి సాయి వినయ్@వినయ్ తండ్రి: శ్రీనివాస్ (లేటు) వయస్సు: 25 సంవత్సరాలు, కులం: గౌడ, వృత్తి: జిమ్ ట్రైనర్,R/o సుధానగర్, హన్మకొండ, ప్రస్తుతం రెడ్డి కాలనీ హన్మకొండ.
2) లావుడియా రవీందర్ తండ్రి: లక్ష్మణ్, వయస్సు: 40 సంవత్సరాలు, కులం: లంబడ, వృత్తి: ఆటో డ్రైవరు, R/o అన్నంపల్లి తండా H/o జగ్గన్నపేట, మండలం& జిల్లా: ములుగు.
3). గుగులోత్ హరి సింగ్ @ హరి, తండ్రి: దస్రు, వయస్సు: 45 సంవత్సరాలు, కులం : లంబడ, వృత్తి: ఆటో డ్రైవరు, R/o అమర్ సింగ్ తండా, మండలం: తొర్రూర్, జిల్లా: మహబూబాబాద్
పరారీలో ఉన్న నేరస్తుల పేర్లు:-
1) హరి, 2) కబీర్ సింగ్,3) రమూర్తి ,4) భూక్యా వినోద్,5) కుశాల్,6) హరీష్,7) జై సింహ
పై నేరస్థుల వద్ద స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు:
1) 10-కిలోల ఎండు గంజాయి విలువ 5,00,000/- 2) 2-కిలోల హశీష్ ఆయిల్ విలువ 25,00,000/-, 3) 3- సెల్ ఫోన్, 4) 1-రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ సైకిల్, 5) 1- బజాజ్ ఆటో
Smt. Shaik Saleema IPS. DCP Central zone, వరంగల్ కమిషనరేట్ గారు , హణమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బందిని,మరియు TG-NAB Warangal సిబ్బందిని అభినందించారు.
…………………………………………