* ఇప్పటికైనా కళ్లు తెరవాలి
* అగ్నిమాపక సన్నద్ధతపై సమీక్షించాలి
* రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
* పాతబస్తీ అగ్ని ప్రమాదంపై మాజీ మంత్రి హరీశ్రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రమాదాల నివారణలో ప్రభుత్వం విఫలమవుతోందని, వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) మండిపడ్డారు. హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం అత్యంత బాధాకరమని అన్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారని చెప్పారు. ఎంతో మంది క్షతగాత్రులు అవుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే అగ్నిమాపక శాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
