
* బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరు న్యూస్, రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తన భూమిని కాంగ్రెస్ (CONGRESS) నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్కబోయిన కుంటయ్యపైనే కేసు బనాయించి వేధించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సివిల్ మ్యాటర్లో పోలీసులు దూరి సెటిల్మెంట్లు, అరాచకాలు చేయడం సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య భౌతికకాయానికి బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నాయకులు ఏం చేప్తే అది చేయడాన్నే డ్యూటీగా భావించి పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కుంటయ్య చావుకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
…………………………………………..