
* ఎన్నికల హామీలను విస్మరించిన ప్రభుత్వం
* చల్పాక ఆదివాసులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి
* మాజీ జెడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి
ఆకేరు న్యూస్ తాడ్వాయి ః అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి , మాజీ జెడ్పి చైర్ పర్సన్ బడే నాగజ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం మండలంలోని కాటాపుర్ గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని పార్టీ శ్రేణులతో కలిసి బడే నాగజ్యోతి బెస్త గుంపు నుంచి కాటాపూర్ క్రాస్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ములుగు జిల్లాలలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.2023లో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాటాపుర్ గ్రామంలో 108 మందికి భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశామని కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఎమ్మార్వోను, కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించిన ఇండ్లపట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మేడారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక దందా చేస్తూ ఉండగా అక్కడి తాహసిల్దార్ గిరిబాబు,మంజూల వారి లారీలను పట్టుకోని ఆఫీస్ కు తరలించిన నేపథ్యంలో వారిన బదిలీ బదిలీ చేయించి అక్రమ సంపాదనకు ఒడికడుతున్నారని నాగజ్యోతి ఆరోపించారు. అదేవిధంగా అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసుల గుడిసెలను ఫారెస్ట్ అధికారులు తొలగించడం బాధాకరమైనదని ఆవేదన వ్యక్తం చేశారు.చల్పాక గ్రామంలో ఆదివాసులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి,మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య,పార్టీ సీనియర్ నాయకులు దిడ్డి మోహన్ రావు,నుశెట్టి రమేష్, పోగు నగేష్,ఇంద్రారపు లాలయ్య, సాయిని లక్ష్మీనర్సు, బందెల తిరుపతి,దొనకే తిరుపతి, గ్రామ అధ్యక్షుడు రంగు సత్యం, ఎండి రఫిక్,గండు బిక్షపతి,జాదు చంద్రం,మాజీ సర్పంచి గౌరమ్మ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….