
ఆకేరు న్యూస్, హనుమకొండ ః గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ బస్టాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గూడూరు మండలం ఇప్పల తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అనే అతను అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ అమ్ముతున్నాడు అదే క్రమంలో ఈరోజు మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం, పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీస్లు పట్టుకొని కేసు నమోదు చేశారు. లచ్చిరాంను పట్టుకున్న ఏఎస్ఐ రఘునారెడ్డి కానిస్టేబుల్ కరుణాకర్ ని సిఐ అభినందించారు.
…………………………………………