Peddi Sudarshan Reddy Shifted to Hyderabad via Green Channel
అకేరు న్యూస్, వరంగల్:
గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్కు పెద్ది సుదర్శన్ రెడ్డి తరలింపు.
పెద్ది సుదర్శన్ వెంట కుటుంబ సభ్యులు, కేటీఆర్, హరీష్ రావు.
గుండెపోటుతో హనుమకొండ రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ప్రభుత్వ చొరవతో వరంగల్ –హైదరాబాద్ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయన్ను తరలిస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
క్లియరెన్స్ కోసం పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేశారు.
