
* కేరళలో కాషాయ జెండా ఎగురవేస్తాం
* 2026లో తమిళనాడులో గెలుస్తాం
* బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య
ఆకేరు న్యూస్ విశాఖపట్నంః రానున్న రోజుల్లో దక్షిణ భారత దేశం బీజేపీ వశం అవుతుందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య జోస్యం చెప్పారు. శుక్రవారం ఏపీలోని విశాఖలో పలు కార్యక్రమాల్లో తేజస్వీ సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర భారతంలోనే కాదు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ,తమిళనాడులో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అని ఆయన కొనియాడారు. చంద్రబాబుకు విజన్ ఉన్న నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరుందని అన్నారు. ఆయన నేతృత్వంలో ఏపీ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల నేతృత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.
………………………………………