* త్వరలో అక్రిడేషన్ కార్డులు
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్ ఖమ్మం : త్వరలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కనిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు, గురువారం ఆయన ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) జిల్లా మహాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. జర్నలిస్టల ఇళ్ల స్థలాల విషయం సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నందున ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇళ్ల స్థలాల కేటాయింపులో ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదనే ఆచితూచి వ్యవహరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
