* రెస్టారెంట్ యజమాని నుండి రూ. 60వేలు డిమాండ్
* డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ దుర్గాప్రసాద్
ఆకేరు న్యూస్ డెస్క్ : వరంగల్ లో నేషనల్ హైవే అథారిటి డైరెక్టర్ గా పనిచేస్తున్నదుర్గాప్రసాద్ ను సీబీఐ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. వివరాల్లో కి వెళితే బీబీ నగర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వ్యక్తి రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆ రెస్టారెంట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని రెస్టారెంట్ యజమానిని బెదిరించిన దుర్గా ప్రసాద్ రెస్టారెంట్ నిర్వహణకు యజమాని వద్ద నుండి లంచం డిమాండ్ చేశారు. తనకు ఇంకా 5 సంవత్సరాల పదవీ కాలం ఉందని తనకు కొంత అమౌంట్ ఇస్తే ఈ ఐదేళ్లు రెస్టారెంట్ కు ఏ అటంకం లేకుండా తను చూసుకుంటానని రెస్టారెంట్ యజమానికి హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న సీబీఐ అధికారులు బుధవారం రెస్టారెంట్ యజమానివద్ద నుండి దుర్గాప్రసాద్ రూ 60వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హైదరాబాద్, వరంగల్,సదాశివపేటలో ఉన్న దుర్గాప్రసాద్ నివాసాల్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
