
ఆకేరు న్యూస్, నల్గొండ : పోక్సో కేసులో దోషికి 21 ఏళ్ల జైలు శిక్షవిధిస్తూ సోమవారం నల్గొండ కోర్టు తీర్పు ఇచ్చింది. 2018 ఫిబ్రవరిలో ఎమిదేళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో దోమల రాముపై నల్గొండ జిల్లా చిట్యాల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. 2022 నుంచి నల్గొండ పోక్సో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం పోక్సో కోర్టు ఇన్ఛార్జి జడ్జి రోజారమణి దోషి దోమల రాముకు 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30వేలు జరిమానా విధిస్తూ తర్పు వెలువరిచారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
………………………………………………..