* సురేశ్ రైనా, శిఖర్ ధావన్పై సజ్జనార్ ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహమ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి… అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ లో చేసిన పోస్టు వైరల్ గా మారింది. బెట్టింగ్ యాప్ కేసులో కేంద్ర ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్లకు చెందిన రూ.11.14కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సైట్ వన్ ఎక్స్బెట్ (1xBet)కు సంబంధించిన కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తిని, రూ.6.64 కోట్ల విలువైన రైనా మ్యూచువల్ ఫండ్స్ను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈనేపథ్యంలోనే సజ్జనార్ ఎక్స్ లో చేసిన పోస్టు వైరల్ గా మారింది.
