* పోలింగ్ నేపథ్యంలో సీపీ సజ్జనార్ నిషేధాజ్ఞలు
* గుంపులుగా కనిపిస్తే చట్ట రీత్యా చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
జూబ్లీహిల్స్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఉప ఎన్నిక నేపథ్యంలో సీపీ సజ్జనార్ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రతలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో బిఎన్ ఎస్ ఎస్ 163 అమల్లో ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలు అవుతాయన్నారు. నియోజకర్గ పరిధిలో ప్రజలు ఐదుగురు కంటే ఎక్కువగా, గుంపులు గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నిక అనంతరం ఫలితాల సందర్భంగా నవంబర్ 14 సాయంత్రం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు 163 అమలు ఉంటుందన్నారు. లిక్కర్ షాపులు, క్లబ్లులు, రెస్టారెంట్లు మూసి వేయాలని ఆదేశించారు. పోలీసుల ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
