* బాధిత కుటుంబాలకు తెలంగాణ సర్కారు బాసట
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తీవ్ర విషాదం నింపిన సౌదీ బస్సు ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయినట్లు అధికారికంగా వెల్లడించింది. చనిపోయిన వారందరూ హైదరాబాద్ వాసులే అని ప్రకటించింది. వారిలో 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. నాలుగు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా జెడ్డాకు వెళ్లినట్లు హజ్ కమిటీ వివరించింది. సౌదీలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. భారత్ నుంచి మక్కా, మదీనా యాత్రకు వెళ్లారు వారంతా. బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో బస్సు దగ్ధమైంది.
సమాచారం కోసం వీరిని సంప్రదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నంబర్లు ప్రకటించాయి.
తెలంగాణ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు
79979 59754, 99129 19545
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ కంట్రోల్ రూం నెంబర్లు
వందన (రెసిడెంట్ కమీషనర్ పీఎస్) : ఫోన్ నెంబర్ 98719 99044
సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) : ఫోన్ నెంబర్ 99583 22143
రక్షిత నైల్ (Liaison Officer): ఫోన్ నెంబర్ 96437 23157
సౌదీ అరేబియాలో ఇండియన్ ఎంబసి హెల్ప్ లైన్ నెంబర్
టోల్ ఫ్రీ నెంబర్ 8002440003
…………………………………………………..
