* సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన సంఘం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డైరెక్టర్ రాజమౌళిపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. రాష్ట్రీయ వానర సేన సంఘం నాయకులు సరూర్నగర్ పోలీసులు ఫిర్యాదు చేసింది. వారణాసి గ్లింప్స్లో మహేష్ బాబు నందిపై కూర్చోని కనిపించడంతో.. హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నందిపై హీరోని కూర్చోబెట్టాడని ఒక కేసు.. బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రైలర్లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చూపించాడని రాజమౌళిపై మరో కేసు నమోదైనట్లు సమాచారం..ఇప్పటికే వారణాసి ఈవెంట్లో హనుమంతుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని సరూర్నగర్ పోలీసులకు రాష్ట్రీయ వానర సేన సంఘం ఫిర్యాదుతో ఈ మూడు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
…………………………………………………….
