ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, బెదిరింపులకు దిగినా, దాడులు చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని అన్నారు. గుర్తుంచుకోండి.. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందన హెచ్చరించారు. పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయి. క్షణికావేశంలో ఏ చిన్నతప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయని వివరించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను సీపీ సజ్జనార్ ఖండించారు. ప్రభుత్వ అధికారుల భద్రత, గౌరవం, వారి విధులకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత అని సీపీ చెప్పారు.
………………………………………………………………
