ఆకేరు న్యూస్, ములుగు: రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటదారుల నుండి కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై అభిప్రాయాలను సేకరించడం జరిగినదని అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి తెలిపారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం, విస్తృత సేకరణ ములుగు జిల్లా లో రైతులు, విత్తన డీలర్లు, విత్తన ఉత్పత్తిదారులు, అన్ని సంబంధిత వర్గాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కొత్త విత్తన బిల్లు-2025 లోని సెక్షన్లు మరియు క్లాసులు, విత్తన చట్టం 1966 లోని లోపాలు మరియు కొత్త విత్తన చట్టం 2025 లోని లక్ష్యాలు ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన రైతులు, విత్తన వ్యాపారులు, విత్తన ఉత్పత్తిదారులు, నర్సరీల యజమానులు, ఇతర వాటదారులు బిల్లులోని ప్రతి క్లాజ్పై తమ సూచనలు అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఏటూరునాగారం అవినాష్ వర్మ, జిల్లాలోని అన్ని మండలాల మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………….
