ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని జయ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో 1986-87 తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం అహల్లాదకర వాతావరణంలో ఆదివారం జరిగింది. 39 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆ పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, యోగక్షేమాలు తెలుసుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పార్శి రంగారావు, నిమ్మ త్రివేణిల పర్యవేక్షణలో 55 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నెల్లుట్ల సునీత, శారద, శోభారాణి, మహేశ్వరి, మంజుల, కిషోర్, రవి, శ్రీనివాస్, విద్యాసాగర్ రెడ్డి, విష్ణు, లింగారెడ్డి, రాజయ్య, సర్వర్ పాషా, రాం నారాయణ, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………….
