ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం చింతగట్టు సమ్మక్క జాతర ఆదాయం రూ.4 లక్షల 15 వేల 7 వందలు వచ్చినట్టు జాతర కమిటీ చైర్మన్ తోట వెంకన్న, దేవాదాయశాఖ ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. సోమవారం జాతర ప్రాంగణంలో ఇప్పగూడెం, రంగరాయ గూడెం, కోమటి గూడెం, అక్కపల్లి గూడెం కుల సంఘాల సమక్షంలో హుండీలను లెక్కించారు. గత జాతరలో రూ. 3 లక్షల 96 వేలు రాగా ఇప్పుడు రూ.4 లక్షల 15 వేల 7 వందలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కరుణాకర్ సర్పంచులు రాణి అనిల్, శిరీష్ రెడ్డి, సోమయ్య, లక్ష్మణ్ కుల పెద్దలు కత్తుల కట్టమల్లు, మందపురం ఎల్ల గౌడ్, సూపర్ండెంట్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

…………………….
