IBPS PO MT SO Recruitment 2026
ఆకేరు న్యూస్, డెస్క్: వెనెజువెలాను వణికించిన భారీ భూకంప విలయంలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. మృత్యు గహ్వరంలో చిక్కుకున్న 79 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడి, చావును సైతం జయించింది. భూకంపం ధాటికి కూలిపోయిన భవన శిథిలాల కింద కొన్ని రోజుల పాటు నలిగిపోయిన ఆ బామ్మను భారత సైన్యం (Indian Army) అత్యంత సాహసోపేతంగా, సజీవంగా వెలికితీసింది.
* ప్రశంసలు అందుకుంటున్న ‘ఆపరేషన్ అమిస్తాద్’
భూకంప బాధిత వెనెజువెలాకు అండగా నిలిచేందుకు భారత దేశం ‘ఆపరేషన్ అమిస్తాద్’ (Operation Amistad) పేరుతో మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన మన సైన్యం, అక్కడ అహోరాత్రులు సహాయక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం శిథిలాలను తొలగిస్తుండగా ఓ చోట 79 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే స్పందించిన సైనికులు ఆమెను సురక్షితంగా బయటకు తీసి, అత్యవసర వైద్య చికిత్స అందించారు.
దీనికి సంబంధించిన వివరాలను, ఫోటోలను భారత సైన్యం బుధవారం అధికారికంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది. కొన్ని రోజుల పాటు ఆహారం, నీరు లేకుండా అంత పెద్ద శిథిలాల కింద ఉండి కూడా ఆమె ప్రాణాలతో బయటపడటం నిజంగానే ఒక అద్భుతమని స్థానికులు, నెటిజన్లు కొనియాడుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి వెనెజువెలా ప్రజలను కాపాడుతున్న భారత సైన్యంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ALSO READ :
