
* రాష్ట్రంలో ఫేక్ ఎన్ కౌంటర్లు మళ్లీ మొదలు
* హోం మంత్రిగా ఫెయిల్.. ముఖ్యమంత్రిగా ఫెయిల్..
* కాంగ్రెస్ ప్రభుత్వంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్
* సర్కారుపై మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్
* గాంధీ ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన బీఆర్ ఎస్ బృందం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్(Law and Order) గాడి తప్పిందని, అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని ఆరోపించారు. గిరిజన మహిళ లైంగికదాడికి గురై చావు బతుకుల్లో ఉంటే.. పరామర్శించే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా, గిరిజన మంత్రిగా అన్ని రకాలుగానూ రేవంత్ రెడ్డి(Revanthreddy) ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు బాధితురాలిని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో కలిసి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు(Harish rao) మాట్లాడుతూ… జైనూరు(jainoor)లో సంఘటన అత్యంత పాశవికమైనదని, దారుణంగా లైంగికదాడికి పాల్పడి రాయితో ముఖం మీద దాడి చేశారని తెలిపారు. కొత్త డీజీపీ వచ్చాక నాలుగు దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. మొన్న నాగర్ కర్నూల్ లో చెంచు మహిళపై, ఎల్బీనగర్ లో నాలుగేళ్ల చిన్నారిపై, పెద్దపల్లిలో ఆరేళ్ల బాలికపై, భూపాలపల్లిలో పోలీసు కానిస్టేబుల్ మీద ఎస్సై, నల్లగొండ జిల్లాలో దివ్యాంగ మహిళ మీద లైంగిక దాడులు జరిగాయని వెల్లడించారు.
9 నెలల్లో 1900 అత్యాచార కేసులు
9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచారం కేసులు నమోదయ్యాయని హరీశ్రావు వెల్లడించారు. మహిళలకు భద్రత కరువైంందని సబిత అసెంబ్లీలో మాట్లాడిన మరుసటి రోజే హైదరాబాద్ లో నాలుగు అత్యాచారాలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో మళ్లీ ఫేక్ ఎన్కౌంటర్లు(Fake encounters) మొదలయ్యాయని, కేసీఆర్ హయాంలో రక్షణకు కేరాఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చారని వెల్లడించారు. పోలీసు గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ సేఫ్టేస్ట్ సిటీ అని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఈ నగరానికి ఏమైందని కథనాలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వపన్స్ సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కొత్త డీజీపీ హయాంలో మత కలహాలు
బీహార్లో ఉండే నాటు తుపాకులు తెలంగాణకు ఎలా వస్తున్నాయని, నాటు తుపాకులు రాజ్యమేలుతున్నాయని హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వ జమెత్తారు. కొత్త డీజీపీ(DGP) వచ్చిన రెండు నెలల్లో నాలుగు మత కలహాలు జరిగాయని విమర్శించారు. సరైన అధికారిని సరైన స్థానంలో పెట్టాలని, మీరు ప్రమోషన్ ఇస్తున్నరా లేక డిమోషన్ ఇస్తున్నరా అని రేవంత్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళా భద్రత కరువైందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలన్నారు. డయల్ 100 కూడా పని చేయడం లేదన్నారు. జర్నలిస్టుల మీద దాడులు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ఫెయిల్.. ఫెయిల్..
ముఖ్యమంత్రిగా ఫెయిల్(Fail).. విపత్తు సాయం చేయడంలో ఫెయిల్.. రుణమాఫీ చెయ్యడంలో ఫెయిల్.. విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్.. హోం మంత్రిగా ఫెయిల్(Fail).. రెండు హత్యలు, మూడు మానభంగాలు అన్నట్లు రాష్ట్రం మారిందన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఎన్ కౌంటర్ జరగటం ఆరుగురు చనిపోవడం చూశామని, కేసీఆర్ పాలనలో ఎన్ కౌంటర్లు(Encounters) జరిగాయా.. అని ప్రశ్నించారు. పేరుకే ప్రజాపాలన.. అన్ని నిర్బంధాలే అన్నారు. జైనూరు ఘటనలో బాధితురాలికి ప్రభుత్వం వెంటనే రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారి పనులను వారు చేసుకోనివ్వాలని కోరారు.
—————————-