
ఆకేరు న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అండర్-17 బాలికల క్రీడా పోటీలను హనుమకొండ కలెక్టర్ పి .ప్రావిణ్య ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఎన్ సీ సీ విద్యార్థినిలు కలెక్టర్ కి గౌరవ వందనాన్ని సమర్పించి ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం క్రీడాజ్యోతి ప్రజ్వలన చేసిన కలెక్టర్ క్రీడా పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ… గురుకులాలలో నాణ్యమైన విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థినిలు క్రీడా స్ఫూర్తి కనబరుస్తూ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి తద్వారా రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలన్నారు.
విద్యార్థులతో వాలీబాల్ ఆడిన కలెక్టర్
వివిధ పాఠశాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లోభాగంగా వాలీబాల్ మ్యాచ్లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రావిణ్య వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రామ్ రెడ్డి , ఉమ్మడి వరంగల్ గురుకుల పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ మోతె రాజ్ కుమార్, డిసిఓలు వెంకటేశ్వర్లు, సరిత, కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు, ఎమ్మార్వో సురేష్ ,ప్రిన్సిపాల్స్ సౌజన్య, డాక్టర్ తాడూరి రవీందర్, ఓదెల మల్లయ్య, వెంకటేశ్వర్లు, పీడీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….