
* నిర్థిష్ట ప్రణాళికలతో లక్ష్యాలను సాధించుకోవాలి
* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్
ఆకేరున్యూస్, ములుగు: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వివిధ ఆరోగ్య సమస్య లతో వస్తున్న రోగులను, ఆప్యాయతతో పలకరిస్తూ, విలువలతో కూడిన వైద్య సేవలను అందించాలన్నారు. మెరుగైన వైద్య అందించినప్పుడే వైద్య ఆరోగ్య శాఖ పట్ల ప్రజలలో నమ్మకం పెరిగి ఎక్కువమంది ప్రభుత్వ దావఖానకు వస్తారని తెలిపారు .అత్యవసర నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏమైనా పరికరాలు, అవసరం పడితే వాటిని కొనుగోలు చేసి వైద్య సేవలు అందించాలని, వాటికి అవసరమైన బడ్జెట్ అందిస్తామన్నారు. వైద్య శాఖ చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలుపై ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును తెలుసుకొని, నిర్దిష్టమైన ప్రణాళికతో, ఒక కాలపరిధిని ఎంచుకొనీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి లక్ష్యాలను సాధించాలని డాక్టర్లకు తెలిపారు.
వైద్య సేవలు అందించడంలో ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై ఎవరు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించకూడదని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. గోపాలరావు మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడుతున్న వారు టేలి మానస్ ఫోన్ కాల్ లను వినియోగించుకోవాలని, అలాగే పాఠశాల విద్యార్థులకు మానసిక ఆరోగ్యం మీద అవగాహన కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో వచ్చే మహిళలకు క్యాన్సర్ల , థైరాయిడ్ మధుమేహం మొదలగు వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ వారికి వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధిక శాఖ అధికారి డాక్టర్. విపిన్ కుమార్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రణధీర్ ,డాక్టర్ భవ్యతో పాటు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ ఆర్ బి ఎస్ కే డాక్టర్స్ డెమో సంపత్, ఎన్ హెచ్ ఎం తిరుపతిరెడ్డి ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………