
* పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు
* యాదాద్రి అభివృద్దిపై అధికారులతో సమీక్ష
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 8:45 గంటలకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు యాదాద్రి అధికారులతో ఆలయ అభివృద్దిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మూసి పునరుజ్జీవ ప్రజా చైతన్య పాదయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం 1 గంటకు వలిగొండ మండలం సంగెం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా చైతన్య పాదయాత్ర చేపడుతారు. మూసీ పరివాహక ప్రాంతంలో 6కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే భీమలింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శించనున్నారు. అనంతరం మూసి పరివాహక ప్రాంత రైతులతో సమావేశం కానున్నారు. రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకోనున్నారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎంపీ చామల కిరణ్ కుమార్, ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
………………………………………