
* నల్పూర్ స్టేషన్ సమీపంలో ఘటన
* తప్పిన ప్రమాదం
* సురక్షితంగా ప్రయాణికులు
ఆకేరున్యూస్ డెస్క్ : సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ఈ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సౌత్-ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో వెల్లడిరచారు. పట్టాలు తప్పిన వాటిల్లో రెండు ప్రయాణికుల బోగీలు కాగా, ఒక పార్సిల్ వ్యాన్ అని అధికారులు తెలిపారు. రైలు సికింద్రాబాద్ నుంచి శాలిమార్ వెళ్తుండగా.. ట్రాక్ మారుతుండగా ప్రమాదం జరిగిందని. ..ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, వారిని ప్రత్యేక బస్సుల్లో వారి వారి గమ్యస్థానాలకు తరలించామని అధికారులు వెల్లడిరచారు.
…………………………………….