
* మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపణలు
* న్యూయార్క్ నుంచి వర్చువల్ సందేశం
ఆకేరు న్యూస్ డెస్క్ : బంగ్లాదేశ్ పరిణామాలపై మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సంచలన ఆరోపణలు చేశారు. తాత్కాలిక నేత మహమ్మద్ యూనుస్ మైనార్టీలను తీవ్ర ఊచకోస్తున్నట్లు ఆమె ఆరోపించారు. న్యూయార్క్(New york) నుంచి ఆమె వర్చువల్ సందేశం ఇచ్చారు. తనను, తన సోదరి షేక్ రెహానాను కూడా యూనుస్ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్లాన్ వేసిందని, తన తండ్రి షేక్ ముజ్బీర్ రెహ్మాన్ను చంపిన మాదిరిగానే హత్యకు కుట్ర(Murder plane) జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు మైనార్టీలపై దాడులకు పాల్పడుతున్నారని, విద్యార్థి సంఘాల కోఆర్డినేటర్లు, యునుస్ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
…………………………….