* మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండామురళి అన్నారు. ఆదివారం ఆయన పిసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. వరంగల్ నేతలపై గతంలో కొండా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఇరు వర్గాలు పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో గతంలో పిసిసి క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరై వివరణ ఇచ్చారు.. ఈ సార్ కొండా మురళి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ ఆదేశం మేరకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానని మొదటి నుంచి తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన నేతగా ఎదిగానని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అన్నారు.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
