
* మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పటాన్ చెరు ఆటో డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో ఆటో కార్మికులు శుక్రవారం హరీష్ రావును కలిసి తమ గోడు విన్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో కార్మకుల ఉపాధి కరువైందన్నారు. 18 నెలల్లో 142మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లు నెలనెలా కిస్తీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాది 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు.చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ.24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాం. ఆటో కార్మికుల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తానని హరీష్ హామీ ఇచ్చారు.
………………………………………