
* డీఎన్ ఏ పరీక్షలో ధ్రువీకరణ
* కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సీఎంఓ చర్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ (Vijay Rupani) భౌతిక కాయాన్ని అధికారులు గుర్తించారు. డీఎన్ ఏ పరీక్షలో ఆయన ఆనవాళ్లను కనుగొన్నారు. గుజరాత్ సీఎంఓ అధికారులు సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు. విజయ్ రూపానీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంపై చర్చించారు. విజయ్ రూపానీ స్వస్థలం రాజ్ కో్ట్(Rajkot)లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా డీఎన్ ఏ పరీక్షలు, డెడ్ బాడీల అప్పగింత ప్రక్రియలో 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. పేలుడుతో వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో చనిపోయిన వారు మాంసపు ముద్దలుగా మారిపోయారు. డీఎన్ ఏ పరీక్షలో దంతాలు, ఎముకలు కీలకంగా మారాయి. డెడ్ బాడీలకు డీఎన్ ఏ (DNA)గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు 32 మంది డీఎన్ ఏలను మృతదేహాలతో అధికారులు సరిపోల్చారు. 14 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సివిల్ ఆస్పత్రి అధికారులు అప్పగించారు.
……………………………………….