
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: తాము చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారని.. ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైందని ఎమ్మెల్సీ కవిత ( MLC KAVITHA) అన్నారు. మాగునూరు (MAGUNUR) జెడ్పీ హైస్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ( FOOD POISON) ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే కాంగ్రెస్ సర్కార్ అక్రమ అరెస్టులకు తెరలేపిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాం మోహన్ రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా ఖండిరచారు.
………………………………….