
మాజీ మంత్రి హరీశ్రావు.
* ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం
* ప్రెస్ అకాడమీ చైర్మన్కు నీ రాజీనామా పంపు
* నేను ఐదు నిమిషాల్లో పంపిస్తా
* బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తుంరు
* అభివృద్దిలో ఆదర్శం కేసీఆర్.. తిట్లలో ఆదర్శం రేవంత్
– మాజీ మంత్రి హరీశ్రావు
ఆకేరు న్యూస్, సిద్దిపేట : తెలంగాణలో రాజీనామా సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రాజీనామాకు సిద్ధం అంటూ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు..తాజాగా మరోసారి సవాల్ విసిరారు. బీఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్ లో హైదరాబాద్లోని జల దృశ్యంతో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్థానం ప్రారంభమైందని, నేడు దేశానికే ఆదర్శమైందని తెలిపారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. బీఆర్ ఎస్ అమల్లోకి తెచ్చిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసిందని, రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టిందని వివరించారు. కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే, రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని విమర్శించారు. మా ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు కోసం తాను రాజీనామాకు సిద్ధమయ్యానని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ కోసం నాడు రాజీనామా పేరుతో జిరాక్స్ పేపరు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, తప్పించుకొని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి అని అన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని, సొల్లు కాదు.. సీదా మాట్లాడు.. సూటిగా మాట్లాడు.. అని రేవంత్ రెడ్డికి సూచించారు. స్పీకర్ ఫార్మాట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి పంపించు, నేను 5 నిమిషాల్లో పంపిస్తా… అంటూ సవాల్ విసిరారు. తనకు పదవులు ముఖ్యం కాదని, రైతులు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని వివరించారు. నాడు ఓటు కు నోటు.. నేడు దేవుళ్లపైన ఒట్లు.. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీ లు అమలు చేస్తావో లేదో చెప్పు.. అంటూ రేవంత్ను ప్రశ్నించారు. రుణమాఫీ చేయాలని అడిగితే కాంగ్రెస్ మంత్రులు తనను తిడుతున్నారని, హామీలు అమలు అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని హరీశ్ స్పష్టం చేశారు.
———————–