Godavari Flow Maharashtra Floods
అకేరు న్యూస్, మహారాష్ట్ర :గతవారం మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నాసిక్ జిల్లాలోని సైకెడా వద్ద పంటపొలాలు, ఇళ్లను వరద ప్రవాహం ముంచేసింది. పలు జలాశయాల గేట్లను తెరిచారు.
గోదావరిపై ప్రధానమైన జయక్వాడి డ్యామ్ ఫుల్ కెపాసిటీ 102 టీఎంసీలు కాగా ప్రస్తుతం 50 టీఎంసీలు దాటింది. అది నిండితే తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయి. అటు మేడిగడ్డ బ్యారేజీ వద్ద 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది.
