* ఈదురుగాలుల తీవ్రతకు కూలిన చెట్లు
* విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం స్టాలిన్
* రాత్రి 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత
ఆకేరు న్యూస్, డెస్క్ : భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులకు తమిళనాడు(TAMILANADU) అల్లాడుతోంది. ఫెయింజల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై(CHENNAI), పుదుచ్చేరి(PUDHUCHERI)లో ప్రభావం ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం వెల్లడించింది. నీరు నిలిచిన ప్రాంతాల్లో 1666 మోటార్లతో చైన్నయ్లో మోటారు పంపుతో నీటిని తొలగిస్తున్నారు. ఫెయింజల్ తుఫాను ప్రభావానికి తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. రాత్రి 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సందర్శించిన సీఎం స్టాలిన్(CM STALLIN).. పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
