
* రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
* రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్
* చేవెళ్లలో రైతు దీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏ ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే.. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అందరమూ రాజీనామా చేస్తామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS WORKING PRESIDENT KTR) సవాల్ విసిరారు. రైతులకు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చేవెళ్లలో రైతుదీక్ష(RYTHU DEEKSHA) చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ ఎకరాకు రూ.15వేల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ వంద శాతం అమలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఢిల్లీ(DELHI)కి వెళ్లి మొత్తం రుణమాఫీ చేసినట్లు రేవంత్ రెడ్డి (REVANTHREDDY) చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ పది వేలు భిక్షం వేస్తున్నాడని ఎన్నికల ముందు విమర్శలు చేశారని, తాను 15 వేలు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడన్నారు. ఏడాది దాటినా ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో (CONGRESS MENIFESTO) ప్రకారం రైతు భరోసా ఇవ్వాలన్నారు. అమలుకాని హామీలతో కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు.
………………………………………..