ISKCON Warangal Jagannath Rathyatra
అకేరు న్యూస్ వరంగల్ : ఓరుగల్లు మహానగరంలో జులై 20వ తేదీన జగన్నాధుడి రథయాత్ర అత్యంత వైభవపెతంగా, భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావన, ఉట్టిపడేలా కీర్తనలు, భజనలు, నృత్యల నడుమ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ టెంపుల్ వరంగల్ నిర్వాహకులు మురళి వదన కృష్ణ దాస్ ప్రభు తెలిపారు.
ఈ రథయాత్రలో వరంగల్ ట్రై సిటీ ప్రజలు, యువతి, యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపాకు, పాత్రులు అయ్యి విజయవంతం చేయగలరని కోరారు. ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు లడ్డు ప్రసాదాలను అందించనున్నట్లు, అదే విధంగా రాత్రి వెంకటేశ్వర గార్డెన్ లో జరిగే ముగింపు కార్యక్రమంలో భక్తి ఉపన్యాసాలతో, పాటు భోజన వితరణ కూడా ఉంటుందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా వరంగల్ మహానగరంలో ఈ జగన్నాథుడి రథయాత్ర ఎంతో ఉత్సాహంగా సాగుతుందని అన్నారు.
జగన్నాథుడి రథయాత్ర తో పాటు ఇస్కాన్ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఏకాదశి, తదితర పర్వదినాలు అత్యంత వైభఓపెతంగా నిర్వహించడం జరుగుతుందని మురళీవదన కృష్ణ దాస్ ప్రభు మీడియా సమావేశం తెలిపారు..
