
* దళపతి విజయ్ చివరి సినిమానా..?
* రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్
*ఇక ముందు బిజిబిజీ
* ఎన్నికల కోసం కసరత్తు
ఆకేరు న్యూస్, డెస్క్ : దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన నేపధ్యంలో ఆయన నటించిన సినిమా జననాయగన్ పై తమిళనాడులో ఉత్కంఠ నెలకొంది.విజయ్ చివరి సినిమా అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్కంఠతో పాటు భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్ననేపధ్యంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. జనాల్లో అత్యధిక ఆదరణ ఉన్న హీరోలు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది. వారు నటించిన ఆఖరి సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు గతంలోనూ ఇదే జరిగింది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరిగిన నేపధ్యంలో కూడా ఇదే ప్రచారం జరిగింది. ఇప్పుడు విజయ్ విషయంలోనూ అదే ప్రచారం జరుగుతోంది. కాకపోతే రజినీ కాంత్ రాజకీయాల్లోకి రాకుండా వెనుకడుగు వేయగా విజయ్ మాత్రం రాజకీయాల్లో రాణించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. రానున్న కొద్ది రోజుల్లో తమిళనాడులో పాదయాత్ర చేపట్టి గడప గడప తిరిగే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా అలవైకుంఠ పురం సినిమాలో యువత హృదయాలను దోచుకున్న పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్,మమితా బైజు,ప్రియమణి,శృతిహాసన్, నరేన్,ప్రకాశ్ రాజ్ వరలక్ష్మీ తదితరులు నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబందించిన గ్లింప్స్ విజయ్ పుట్టిన రోజు జూన్
21 న రాబోతున్నట్లు సమాచారం.. జూన్ 21 ఎప్పుడెప్పుడు వస్తుందా అని కోసం విజయ్ అభిమానులు ఉర్రూతలూగుతున్నారు.
………………………………………………………