అయ్యో.. కవల పిల్లలను చంపేసి..
* కుటుంబ కలహాలతో ఘోరం
* హైదరాబాద్లో తీవ్ర విషాదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆ తల్లి కూడా బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మారావు నగర్ ఫేస్ -1 లో విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన సాయిలక్ష్మీ (27)కి అనిల్ కుమార్తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత పద్మారావు నగర్ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల వయసు ఉన్న కవల పిల్లలు పుట్టారు. వారి పేర్లు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి గా పెట్టుకున్నారు. ఆ పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తేవి. చేతన్కు మాటలు రాకపోవడంతో కొంతకాలంగా స్పీచ్థెరపీ ఇప్పిస్తున్నారు. పిల్లల విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గొడవ జరగడంతో సాయిలక్ష్మి మనస్తాపం చెందింది. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
