* బర్త్ డే వేడుకలకు దూరంగా జగ్గారెడ్డి
* పాశమైలారం ఘటన నేపధ్యంలో….
ఆకేరు న్యూస్, హైదరాబాద్ః పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. పాశమైలారం సిగాచి రసాయన ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 39 మంది దుర్మరణం చెంది విషాదం మిగిల్చిన నేపధ్యంలో జగ్గారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏడాది పార్టీ కార్యకర్తలు,అభిమానులు,అనుచరుల మధ్య అట్టహాసంగా జులై 7 న తన పుట్టినరోజు వేడుకులను జరుపుకునే జగ్గారెడ్డి ఈ సారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన బర్థ్ వేడుకలు జరుపొద్దు,ఫ్లెక్సీలు పెట్టవద్దు అని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
